MANUU: ‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచారు. మే ముగియనున్న గడువు తేదీని మే 22 వరకు పెంచారు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీఏ) ప్రకారం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు దారులు సీయూఈటీ వెబ్సైట్ను పరిశీలించి దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తులు ఉర్దూ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆన్ లైన్ అడ్మిషన్స్ రెగ్యులర్ మోడ్ కింద ఎంట్రన్స్ ఆధారంగా సీట్లు కేటాయించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 1 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు.
Published date : 07 May 2022 03:23PM