Skip to main content

Rajasthani Bazaar: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం ఎగ్జిబిషన్‌

సాక్షి, చైన్నె: రాజస్తానీ అసోసియేషన్‌ నేతృత్వంలో రాజస్థానీ బజార్‌ పేరిట సంస్కృతి, ఐక్యను చాటే విధంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
Exhibition of Rajasthani art and craftwork. Exhibition for Scholarships for Students, Colorful Rajasthani fabrics and textiles on display.

సెయింట్‌ జార్జ్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ సినీ నటి , కలైమామణి సుకన్య రమేష్‌, నటి నీలిమా రాణి, రిఫెక్స్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ జగదీశ్‌ ప్రారంభించారు. ఇక్కడ 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విభిన్న కళాత్మకాలను కొలువు దీర్చారు.

చదవండి: Scholarships: విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం తోడ్పాటు

ఈ వేడుక ద్వారా వచ్చే మొత్తంలో రూ. 50 లక్షలను విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లకు ఉపయోగిస్తున్నామని న‌వంబ‌ర్ 6న‌ జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్‌ ఎక్స్‌ పో చైర్మన్‌ నరేంద్ర శ్రీమల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నిర్వాహకులు దిలీప్‌ చందన్‌, మోహన్‌ లాల్‌ బజాజ్‌, ప్రవీణ్‌ తాటియా, హేమంత్‌ దుగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 07 Nov 2023 03:15PM

Photo Stories