Skip to main content

Academic Exams: పరీక్షలపై 28న విద్యామంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

Education Minister video conference
Education Minister video conference

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెలలో వివిధ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నెల 28వ తేదీన అన్ని విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. మే 6 నుంచి ఇంటరీ్మడియెట్, మే 23 నుంచి టెన్త్, జూన్‌ 12న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరుగుతున్న విష యం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై సమన్వయం తీసుకొచ్చేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా ఎస్పీలు, డీఈవోలు, ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, పోస్టల్‌ విభాగాలు, ఇంటర్‌ విద్య అధికారులు పాల్గొంటారు.   

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 25 Apr 2022 05:04PM

Photo Stories