క్రమబద్ధీకరించాలంటూ ఇంటర్ బోర్డు ఎదుట అధ్యాపకుల ఆందోళన
Sakshi Education
క్రమబద్ధీకరించాలంటూ తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన ఒప్పంద అధ్యాపకుల(కాంట్రాక్టు లెక్చరర్ల) ను పోలీసులు అరెస్టు చేశారు.
ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణను వెంటనే చేపట్టాలని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 14న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కాంట్రాక్టు లెక్చరర్లు Inter Boardకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. అరెస్టైన వారిలో సమితి నేతలు జంగయ్య, వీ. శ్రీనివాస్, శోభన్బాబు, కే.శైలజారెడ్డి, కురు మూర్తి, ఎల్.దేవేందర్ తదితరులున్నారు.
Published date : 15 Jun 2022 04:16PM