ఓయూలోని వివిధ విభాగాల్లో నేరుగా పీహెచ్డీ ప్రవేశాలకు జేఆర్ఎఫ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఓయూ పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు
ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేటిక్స్, సైన్స్, ఆర్ట్స్, సోషల్సైన్స్, కామర్స్ కోర్సుల్లో కేటగిరీ–1లో భాగంగా పీహెచ్డీలో నేరుగా ప్రవేశాలకు జేఆర్ఎఫ్ అభ్యర్థులు ఆగష్టు 6న సాయంత్రం 5 గంటల వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఖాళీలు లేని సబ్జెక్టులకు దరఖాస్తు చేయకూడదని ఆయా ఫ్యాకల్టీల డీన్లు ఆగష్టు 1న ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులకు ఆగష్టు 10, 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ౌటఝ్చnజ్చీ. ్చఛి. జీn వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.