తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలలో వివిధ కోర్సుల్లో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి మే 30న ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకల్యాణ వెంకన్న వేదపాఠశాలలో అడ్మిషన్లు
వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం జరిగి, వేద, స్మార్త విద్యపై ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, శుక్ల యజుర్వేదం, శుక్ల యజుర్వేద స్మార్తం, అధర్వణ వేదం, యజుర్వేదస్మార్తం, వైఖానసఆగమం, పాంచరాత్ర ఆగమం కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఆసక్తిగలవారు 9989036011, 9550750463 నంబర్లలో సంప్రదించాలని కోరారు.