Admission: నైటింగేల్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హుమయూన్నగర్లోని నైటింగేల్ నర్సింగ్ కాలేజీలో 2022–23 ఏడాదికి మూడేళ్ల జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ కోర్సుల అడ్మిషన్లను 2 వారాల్లోగా పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
నైటింగేల్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి
ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు జస్టిస్ ఎస్.నందా ఇటీవల ఆదేశాలు జారీచేశారు. నర్సింగ్ కోర్సుల అడ్మిషన్లు చేపట్టే నోటిఫికేషన్లో తమ కాలేజీ లేకపోవడంతో నైటింగేల్ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.
దీనిపై హైకోర్టు.. కాలేజీ పర్మిషన్లు రద్దు చేయకుండా అడ్మిషన్లు ఆపడానికి వీల్లేదని తేల్చింది. హైకోర్టు సూచనల మేరకు రెండోసారి తనిఖీ చేసిన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టును పరిశీలించి అడ్మిషన్ల అనుమతి కోసం నోటిఫికేషన్ గడువును పెంచింది.