Skip to main content

ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ఈ 2019 ఎంపిక ప్రక్రియ..పరీక్ష విధానం ఇలా..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)... కేంద్రంలో కీలక కొలువుల భర్తీని చేపడుతోంది. కంబైన్‌‌డ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్)ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కీలకమైన గ్రూపు-బి,సి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. డిగ్రీ అర్హతతోనే సీజీఎల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గెజిటెడ్ కేడర్ పోస్టులకు ఎంపికై ప్రధాన నగరాల్లో పనిచేసే వారు నెలకు రూ.70వేల వరకూ వేతనం అందుకోవచ్చు. దీంతోపాటు సామాజిక హోదా, ఆకర్షణీయమైన వేతనాలు, హోంస్టేట్ పోస్టింగ్ అవకాశాలు, ఇతర ఎన్నో సదుపాయాలు అందుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ-2019కు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ సమాచారం, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...
పోస్టులు.. పేస్కేల్ :
  • పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (గ్రూపు-బి గెజిటెడ్ పోస్టులు).
    వేతనం: బేసిక్ పేస్కేల్: రూ. 47,600.
    వయసు: 30 ఏళ్లు
  • పోస్టు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో-సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఐబీ, రైల్వే, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాల కేంద్ర కార్యాలయాలు, ఇతర మంత్రిత్వ శాఖలు), అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్(ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్,ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్,నార్కోటిక్స్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీబీఐ ఎస్‌ఐ.
    బేసిక్ పేస్కేల్: రూ. 44,900
    వయసు: 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. కొన్ని పోస్టులకు కనిష్ట వయసు 18 ఏళ్లు.
  • పోస్టు: అసిస్టెంట్, అసిస్టెంట్/సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, ఎస్‌ఐ (ఎన్‌ఐఏ), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌వో), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2.
    బేసిక్ పేస్కేల్: 35,400
    వయసు: 30 ఏళ్ల లోపు ఉండాలి. జేఎస్‌వో పోస్టులకు గరిష్ట వయో పరిమితి 32 ఏళ్లు.
  • పోస్టు: ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ (గ్రూపు - సి పోస్టులు)
    బేసిక్ పేస్కేల్: 29,200
    వయసు: 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.
  • పోస్టు: సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్, ఎస్‌ఐ (నార్కోటిక్స్), అప్పర్ డివిజన్ క్లర్క్.
    బేసిక్ పేస్కేల్: 25,500
    వయసు: 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.
గమనిక: ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత సాధించాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. దేహ దారుఢ్య పరీక్షలూ ఉంటాయి.

డిగ్రీ ఉంటే చాలు.. అర్హులే
  • 2020 జనవరి 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సీజీఎల్ పరీక్షకు అర్హులు. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ 2020 జనవరి 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.
  • జేఎస్‌వో పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి (లేదా) డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
  • స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు డిగ్రీలో ప్రతి ఏడాది స్టాటిస్టిక్స్ సబ్జెక్టు చదివిన వారే అర్హులు.
  • ఏఏవో పోస్టులకు చార్టెర్డ్ అకౌంటెంట్/మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/ ఎంకామ్/మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్/ఎంబీఏ(ఫైనాన్స్)/మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ విద్యార్హతలు అభిలషణీయం. ఈ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు ప్రొబేషన్ పీరియడ్‌లో ‘సబార్డినేట్ ఆడిట్/ అకౌంట్ సర్వీస్ ఎగ్జామినేషన్’లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఆయా పోస్టుల ఆధారంగా మూడు/నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో.. టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కమిషన్ నిర్ణయించిన నిర్దేశిత మార్కులు సాధించిన వారినే తర్వాతి దశ టైర్-2కు పిలుస్తారు. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే. దీనితోపాటు టైర్-3(డిస్క్రిప్టివ్ పరీక్ష)కు అర్హత లభిస్తుంది. టైర్-1,2ల్లో రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. సెక్షన్ కటాఫ్ ఉండదు. టైర్-3 ఇంగ్లిష్/ హిందీ భాషలో ప్రావీణ్యం పరీక్షించే విధంగా ఉంటుంది. తర్వాత దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఫైనల్‌గా టైర్ -1, 2, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

పరీక్షా విధానం:
  • టైర్-1ను గంట వ్యవధిలో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు సబ్జెక్టులు.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • టైర్-2: టైర్-1లో కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు టైర్ -2కు అర్హత లభిస్తుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1, పేపర్ -2లు అన్ని పోస్టులకు కామన్. ఇక జేఎస్‌వో పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే.. పేపర్-3(200 మార్కులకు); అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే.. పేపర్-4 (200 మార్కులకు)కు హాజరు కావాలి. పేపర్-3 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌పై; పేపర్-4 ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సబ్జెక్టులపై ఉంటుంది. ఇవి కూడా మల్టీపుల్ చాయిస్ విధానంలోనే జరుగుతాయి. కామన్‌గా పేపర్-1,2ల్లో వరుసగా క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సబ్జెక్టులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్‌లో 100 ప్రశ్నలు-200 మార్కులకు; ఇంగ్లిష్‌లో 200 ప్రశ్నలు- 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు.
  • టైర్-2తోపాటు టైర్-3 కూడా ఒకేసారి నిర్వహిస్తారు. గంట సమయంలో నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో రాయాలి. హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి.

ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
25.11.2019
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు చివరి తేది: 2019 నవంబర్ 27
చలాన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది: 2019 నవంబర్ 29
టైర్-1 కంప్యూటర్ పరీక్ష తేదీలు: 2020 మార్చి 2 నుంచి 11 వరకు
టైర్-2, 3 పరీక్ష తేదీలు: 2020 జూన్ 22 నుంచి జూన్ 25 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తు రుసుం: రూ.100 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in

ఎస్సెస్సీ సీజీఎస్ స్టడీమెటీయల్, ఆన్‌లైన్ టెస్టులు, గెడైన్స్, ప్రీవియస్ పేపర్స్, మోడల్‌పేపర్స్, సిలబస్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 31 Oct 2019 04:41PM

Photo Stories