Skip to main content

మ్యాథ్స్, ఫిజిక్స్‌పై పట్టు లేకుండా ఇంజనీరింగ్‌లో రాణింపు సాధ్యమేనా?!

బీటెక్‌లో చేరాలంటే.. ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ గ్రూప్‌ సబ్జెక్ట్‌లుగా.. ఉత్తీర్ణత సాధించాలనే అర్హత నిబంధన ఉన్న సంగతి తెలిసిందే!

అందుకే..ఇంజనీరింగ్‌ లక్ష్యంగా చేసుకున్న లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్‌ ఎంపీసీలో చేరుతుంటారు! ఆ అర్హత ఆధారంగా సదరు సబ్జెక్ట్‌లతో నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో.. విజయం సాధిస్తేనే ప్రస్తుతం బీటెక్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది! కానీ.. తాజాగా ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యా మండలి).. ఇక నుంచి బీటెక్‌లో చేరాలంటే..‘ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ చదవడం తప్పనిసరికాదు’ అనేలా ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది! ఈ నేపథ్యంలో.. బీటెక్‌లో చేరేందుకు ఏఐసీటీఈ తాజాగా పేర్కొన్న అర్హతలు.. వాటì తో కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావంపై విశ్లేషణాత్మక కథనం..

‘చిన్న ఇల్లు కట్టాలన్నా.. లేదా కొత్తగా ఒక రహదారి నిర్మించాలన్నా.. సివిల్‌ ఇంజనీర్లకు ఫిజిక్స్‌ నైపుణ్యాలు ఎంతో అవసరం. సదరు నిర్మాణం చేపట్టే ప్రదేశంలో సాంద్రత, పటిష్టత వంటివి తెలుసుకోవాలంటే.. ఫిజిక్స్‌ నైపుణ్యాలతోనే సాధ్యం. ఈ స్కిల్స్‌ లేకుండా.. సివిల్‌ ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమే. ఒకవేళ ఫిజిక్స్‌ లేకుండా.. సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివినా.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తడం ఖాయం’
– ఇది బీటెక్‌లో ఫిజిక్స్‌ నైపుణ్యాలపై విద్యావేత్తల అభిప్రాయం.

‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో... ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్, ఐఓటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్‌.. ఇలా ఎందులోనైనా ప్రతిభ చూపాలంటే.. మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు తప్పనిసరి. కోడింగ్, ప్రోగ్రామింగ్‌లను రూపొందించేందుకు అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కాలిక్యులస్‌ వంటి వాటిలో బలమైన పునాది ఉండాలి’
–ఇది బీటెక్‌ ప్రవేశాల్లో మ్యాథమెటిక్స్‌ను ఐచ్ఛికం చేయడంపై నిపుణుల అభిప్రాయం.

...ఇలా ..ఒక్క సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అనే కాదు. ఇంజనీరింగ్‌లో సర్క్యూట్‌ బ్రాంచ్‌లుగా పిలిచే ఈసీఈ, ఈఈఈ, ఐటీ.. అదే విధంగా కోర్‌ బ్రాంచ్‌లుగా పేర్కొనే మెకానికల్, సివిల్‌.. అన్నింటిలోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సిద్ధాంతాల ఆధారంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఇంజనీరింగ్‌ స్వరూపం ఉంటుంది. రోబోటిక్స్‌.. ఫిజిక్స్‌ సూ త్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంజనీ రింగ్‌లో ప్రవేశానికి ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లను చదవడం తప్పనిసరికాదనే ప్రకటన చర్చనీయాంశమైంది.

14 సబ్జెక్టుల జాబితా..
ఏఐసీటీఈ తాజాగా 2021–22 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌ బుక్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌ బుక్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం–బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరిగా చదివుండాలనే నిబంధన తొలగించింది. అంతేకాకుండా.. 14 సబ్జెక్ట్‌లతో జాబి తా పేర్కొని.. ఈ సబ్జెక్ట్‌లలో ఏవైనా మూడు చదివితే.. బీటెక్‌లో ప్రవేశించేందుకు అర్హులేనని పేర్కొంది. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్, బయోటెక్నా లజీ, టెక్నికల్‌ ఒకేషనల్‌ సబ్జెక్ట్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్, బిజినెస్‌ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌. అయితే ఆయా రాష్ట్రాలు, యూనివర్సిటీలు బీటెక్‌ ప్రవేశాల్లో అర్హతలకు సంబంధించి తమ ఈ 14 సబ్జెక్టుల ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని.. అర్హతల విషయంలో యూనివర్సిటీలకు, రాష్ట్రాలకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

ఆ సబ్జెక్ట్‌లు ఇంటర్‌లో?
ఏఐసీటీఈ పేర్కొన్న 14 సబ్జెక్ట్‌లు ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వాస్తవానికి ప్రస్తుతం చాలా రాష్ట్రాలు తమ సొంత కరిక్యులంతో ఇంటర్మీ డియెట్‌ తత్సమాన కోర్సులను బోధిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ ఔత్సాహిక అభ్యర్థుల కోసం ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ అందిస్తున్నాయి. దీంతో ఏఐసీటీఈ తాజా నిర్ణయం పూర్తిగా సీబీఎస్‌ఈ +2 కరిక్యులంను దృష్టిలో పెట్టుకొని∙తీసు కున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టెస్ట్‌ల ద్వారానే ప్రవేశాలు..
అర్హతల విషయంలో పలు మార్పులు చేసిన ఏఐసీటీఈ.. ప్రవేశాలు ఖరారు చేసేందుకు మాత్రం తప్పనిసరిగా ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించాలని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకు, మెరిట్‌ ఆధారంగానే బీటెక్‌లో ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి: part 2: ఆయా రాష్ట్రాలకు సొంతంగా ఎంట్రన్స్‌లు.. విచక్షణ మేరకే ఏఐసీటీఈ నిబంధనలు అమలు..

Published date : 27 Mar 2021 05:03PM

Photo Stories