Skip to main content

డిగ్రీ అర్హతతో త్రివిధ దళాలల్లో ఉద్యోగాలు..నెలకు రూ.56 వేలు స్టయిపండ్

సవాళ్లు ఎదుర్కొనే స్వభావం మీ సొంతమా..ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడానికి సదా సిద్ధమా..క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే తెగువ మీలో ఉందా..మీలాంటి వారికి ఆహ్వానం పలుకుతున్నాయి.. త్రివిధ దళాలు!!చేతిలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్ అర్హతతో..ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో.. పర్మనెంట్ కమిషన్డ్ హోదాలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. దీనికి మార్గమే.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ)!! యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహించే సీడీఎస్ పరీక్షలో విజయం సాధించి.. ఆ తర్వాత ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలోనూ నెగ్గితే.. త్రివిధ దళాల్లో కొలువు ఖాయం అవుతుంది! తాజాగా సీడీఎస్‌ఈ-2021(1) నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో..పరీక్ష విధానాలు.. లభించే ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియతోపాటు.. పరీక్షలో విజయం సాధించడమెలాగో చూద్దాం...

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. దేశ భద్రతలో అత్యంత కీలకం. సాయుధ దళాలు నిరంతరం దేశ రక్షణలో పాల్పంచుకుంటూ.. ఉగ్రవాద చర్యలను, శత్రు దేశాల దుశ్చర్యలను తిప్పికొడుతుంటాయి. మన త్రివిధ దళాలు చూపుతున్న తెగువ, ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రం లేదు. అలాంటి సాయుధ దళాల్లో చేరి... దేశ భద్రతలో భాగస్వాములవ్వాలనే తపన, తెగువ ఉన్న వారికి చక్కటి అవకాశం..కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ). యూపీఎస్సీ ఏటా రెండుసార్లు సీడీఎస్‌ఈ(1), సీడీఎస్‌ఈ(2) పేరుతో ఈ పరీక్షను నిర్వహిస్తుంది. తాజాగా సీడీఎస్‌ఈ(1)-2021కి నోటిఫికేషన్ విడుదలైంది.

345 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ :
సీడీఎస్‌ఈ(1)-2021 ద్వారా త్రివిధ దళాలకు చెందిన మొత్తం అయిదు అకాడమీలలో 345 ఖాళీల భర్తీ చేపట్టనున్నారు.

ఆయా అకాడమీలు, ఖాళీల వివరాలు..
ఇండియన్ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్): 100.
ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమలా): 26.
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్): 32.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)(పురుషులు): 170
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై) (మహిళలు): 17
మొత్తం ఖాళీల సంఖ్య: 345

అకాడమీలు.. అర్హతలు :
ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్‌‌స ట్రైనింగ్ అకాడమీ :
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: మిలటరీ అకాడమీ: జనవరి 2, 1998- జనవరి 1, 2003 మధ్య జన్మించిన, అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
ఆఫీసర్‌‌స ట్రైనింగ్ అకాడమీకి వయసు: జనవరి 2,1997-జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.

నేవల్ అకాడమీ :
అర్హత: బీటెక్/బీఈ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
వయసు: జనవరి 2, 1998- జనవరి 1, 2003 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.

ఎయిర్‌ఫోర్స్ అకాడమీ :
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటుఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 2, 1998-జనవరి1, 2002 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్నవారికి రెండేళ్ల వయోసడలింపు లభిస్తుంది.

  • నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.


చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే..

  • ఆయా అర్హత కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది.ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యమిచ్చేవారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి ప్రొవిజినల్ సర్టిఫికెట్ చూపించాలి. మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు.

రెండు విధాలుగా సీడీఎస్‌ఈ :
సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే రాత పరీక్షలో రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.

ఐఎంఏ, నేవల్, ఎయిర్‌ఫోర్స్.. పరీక్ష విధానం :

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్‌‌జ

2 గంటలు

100

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

2 గంటలు

100


ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ.. పరీక్ష విధానం :

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్‌‌జ

2 గంటలు

100


కటాఫ్ మార్కులు :
మొత్తం ఖాళీల సంఖ్య, అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి టెస్టులను మాత్రం 6రోజులపాటు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూకు 300 మార్కులు :

  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు 200 మార్కులకు, మిగతా వాటికి 300 మార్కులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సరిపడ నైపుణ్యాలున్న అభ్యర్థులను గుర్తిస్తారు. ఈ టెస్టులలో మొదటి రోజు స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. ఇదే స్టేజ్-1 టెస్ట్. ఈ దశలో అర్హత సాధిస్తేనే స్టేజ్-2కు అనుమతిస్తారు.
  • స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్) టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్-2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ లు, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తారు. ఇవి నాలుగు రోజుల పాటు జరుగుతాయి.
  • ఆ తర్వాత అభ్యర్థుల్లోని సమయస్ఫూర్తిని పరీక్షించే ఉద్దేశంతో వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూ ఏటీ), సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్‌ఆర్‌టీ) లు నిర్వహిస్తారు. చివరగా సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్ టాస్కులు ఉంటాయి.


ఇంటర్వ్యూ ఇలా..
ఎస్‌ఎస్‌బీ స్టేజ్-1,2లను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తర్వాత చివరగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు విద్యార్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పీఏబీటీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.

రూ.56.100 స్టయిపండ్ :
అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారిని జెంటిల్‌మెన్ క్యాడెట్, లేడీ క్యాడెట్స్‌గా పిలుస్తారు. వీరికి శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిపండ్ చెల్లిస్తారు. నిర్దేశిత వ్యవధిలో ఉండే శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగంలో పర్మనెంట్ కొలువు సొంతమవుతుంది. ఇండియన్ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్)లో 18నెలలు; నేవల్ అకాడమీలో సుమారు 17 నెలలు; ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ హోదాలో ప్రవేశించవచ్చు. నేవీ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సబ్-లెఫ్ట్‌నెంట్ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.

కెరీర్ఇలా..:
రాత పరీక్షలో,ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో ప్రతిభ చూపి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. రెండేళ్ల అనుభవంతో ఆర్మీలో కెప్టెన్,నేవీలో లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందొచ్చు. ఆరేళ్ల అనుభవంతో ఆర్మీలో మేజర్, నేవీలో లెఫ్టినెంట్ కమాండర్, ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్రన్ లీడర్ స్థాయికి చేరుకోవచ్చు.

విజయం సాధించండిలా..
సీడీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌పై గట్టి పట్టు సాధించాల్సి ఉంటుంది.
ఇంగ్లిష్ :
మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ను అర్థం చేసుకునే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌లో యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెసెస్, క్టోజ్ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెసెస్ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్:
ఈ సెక్షన్‌కు 100 మార్కులు కేటాయించారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డిఫెన్స్ కు సంబంధిం చిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్-అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ :
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. ఈ విభాగంలో 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా,లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, ఫ్యాక్టరైజేషన్ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదో తరగతి స్థాయి పుస్తకాలు ఒకటికి నాలుగుసార్లు చదవడం ద్వారా సన్నద్ధత లభిస్తుంది.

సీడీఎస్‌ఈ(1)-2021 ముఖ్య తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17.11.2020
దరఖాస్తు ఉపసంహరణ: నవంబర్ 24, 2020-నవంబర్ 30-2020
రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 7, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
వెబ్‌సైట్: upsconline.nic.in, upsc.gov.in

Published date : 06 Nov 2020 01:12PM

Photo Stories