Skip to main content

Physical Endurance Test: ఎస్‌ఐ పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి

ఆరిలోవ: విశాఖ రేంజ్‌ పరిధిలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
Physical Endurance Tests for SI male candidates have started again

కై లాసగిరి ఏఆర్‌ పోలీస్‌ మైదానంలో సోమవారం జరిగిన పరీక్షలకు 614 మంది హాజరయ్యారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గత నెల 25న ఇక్కడ దేహ దారుఢ్య పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. గత నెల 29 వరకు కొన్ని బ్యాచ్‌లకు పరీక్షలు జరిగాయి. ఆగస్టు 30 నుంచి ఈ నెల 2 వరకు మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. సోమవారం నుంచి మళ్లీ పురుష అభ్యర్థులకు పరీక్షలు మొదలయ్యాయి. 800 మందికి హాల్‌ టికెట్లు పంపించగా.. 614 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ, విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

చ‌ద‌వండి: Engineering: బీటెక్‌ కోర్సులో రెండో దశ కౌన్సెలింగ్‌

Published date : 05 Sep 2023 03:19PM

Photo Stories