Skip to main content

Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు 12,684 మంది హాజరు

ఇంటర్‌ పరీక్షలకు 12,684 మంది హాజరు
Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు 12,684 మంది హాజరు
Intermediate Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు 12,684 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 51 కేంద్రాల్లో సోమవారం ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌–బీ, జువాలజీ, హిస్టరీ –2 పరీక్షలు నిర్వహించారు. 13,145 మంది విద్యార్థులకు 12,684 మంది హాజరయ్యారు. వీరిలో 11,277 మంది జనరల్‌ విద్యార్థులకు 10,946 మంది, 1,868 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1,738 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 97 శాతంగా నమోదైంది. కలిదిండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదయ్యిందని పరీక్షల కన్వీనర్‌ బి.ప్రభాకరరావు తెలిపారు.

‘పశ్చిమ’లో 97 శాతం హాజరు

భీమవరం: జిల్లాలో సోమవారం ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆర్‌ఐఓ కె.చంద్రశేఖరబాబు తెలిపారు. 50 కేంద్రాల్లో 97 శాతం హాజరు నమోదైందన్నారు. జనరల్‌ పరీక్షకు 13,202 మందికి 12,889 మంది, ఒకేషనల్‌ పరీక్షకు 1,424 మందికి 1,338 మంది హాజరయ్యారు.

Published date : 12 Mar 2024 03:02PM

Photo Stories