Skip to main content

Schools Reopen: ‘ఉత్సాహంగా పాఠశాలలకు’

సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 17 నుంచి ప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.
Schools Reopen
‘ఉత్సాహంగా పాఠశాలలకు’

తొలిరోజు జనవరి 17న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 61 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 70 శాతం, కడప జిల్లాలో 69 శాతం గుంటూరు 68 శాతం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 67 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.

కంట్రోల్‌ రూంల ఏర్పాటు

విద్యార్థులు, తల్లిదండ్రులు కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పాఠశాల విద్య 7833888555, ఇంటర్‌ విద్య 9440816025లలో సంప్రదించేందుకు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు. 

చదవండి: 

Good News: ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ

విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఈ పాఠశాలలు: సీఎం

TSTU: టీచర్ల సమస్యలపై సబిత హామీ: టీఎస్‌టీయూ

Published date : 18 Jan 2022 01:34PM

Photo Stories