School Text Books: 4.42 కోట్ల పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం.. ఈ కాపీలు వెబ్సైట్లో ఉచితంగా అందుబాటులో..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజే (జూన్ 12) వీటిని విద్యార్థులకు పంపిణీ చేసే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ 4.42 కోట్ల పాఠ్యపుస్తకాల ముద్రణకు శ్రీకారం చుట్టింది.
![Printing of 4 crore textbooks started in AP](/sites/default/files/images/2024/03/30/schooltextbooks-1711790421.jpg)
దేశంలోనే ఒకటి నుంచి పదో తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో పాఠ్యపుస్తకాలను అందిస్తున్న బోర్డుగా ఏపీ పాఠశాల విద్యా శాఖ నిలుస్తోంది. 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకం భవిష్యత్తులోనూ రిఫరెన్స్ బుక్గా ఉండేలా తీర్చిదిద్దుతోంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
2024–2025 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్ట్ను పరిచయం చేస్తూ 8వ తరగతి విద్యార్థులకు బోధించనుంది. 3–9 తరగతులకు టోఫెల్ కోసం వర్క్బుక్లను సిద్ధం చేస్తోంది. ఈ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ కాపీలను వెబ్సైట్లో ఉచితంగా అందుబాటులో ఉంచనుంది.
Published date : 30 Mar 2024 02:50PM