Skip to main content

School Admissions: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశా­ల­కు ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహి­స్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమి­షన­ర్‌ సురేశ్‌ కుమార్‌ మార్చి 29న‌ తెలిపారు.
Extension of adarsh schools online application submission

ఆయా మండలా­ల్లోని ఆదర్శ పాఠశాలల్లో మార్చి 31‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం ద­రఖాస్తు గడు­వును ఏప్రిల్‌ 6 వరకు పొడిగించామని తెలిపారు.

చదవండి: Admissions 2024: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు

ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్‌ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాసం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. www.cse.ap.­gov.in/­­­apms.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Published date : 30 Mar 2024 01:24PM

Photo Stories