Andhra Pradesh: విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ విశేష కృషి
![Quality Education for Students in Andhra Pradesh CM Jagan special efforts for the development of the education sector YS Jagan's Education Reforms and Schemes](/sites/default/files/images/2023/12/13/nadyla-1702460840.jpg)
‘వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్’ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 12ననంద్యాలలో ‘విద్యా సాధికారిత జగనన్నతోనే సాధ్యం’ అని తెలిపేలా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
స్థానిక పద్మావతినగర్లోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి శ్రీనివాస్ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: Andhra Pradesh: సహిత విద్యపై ప్రత్యేక ఫోకస్
చైతన్య, సురేష్ మాట్లాడుతూ ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గిందన్నారు.
ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా బోధన, టోఫెల్ శిక్షణ తదితర కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చైర్మన్ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.