Minister of Education: సెలవులపై దుష్ప్రచారం చేస్తే చర్యలు
Sakshi Education
రాష్ట్రంలో పాఠశాలల్లో తరగతులు నిర్వహణ ప్రశాంతంగా జరుగుతోందని, కానీ పాఠశాలలకు సెలవులు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
కొన్ని చానెల్స్ పేరుతో మార్ఫింగ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అంటూ పాఠశాలలకు సెలవులు, హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్లండి అని కొందరు ప్రచారం చేయడాన్ని మంత్రి ఖండించారు. ఇటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వారు, వాటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తోన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవులపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.