Skip to main content

9, 10 తరగతుల విద్యార్థులకు రవాణా భత్యం

సాక్షి, హైదరాబరాద్: ఇన్నాళ్లూ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఇచ్చిన రవాణా భత్యాన్ని 9, 10 తరగతుల విద్యార్థులకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2021–22 విద్యాసంవత్సరం నుంచి దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,150 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థుల ఆవాసాలు స్కూల్స్కు దూరంగా ఉన్నాయి. ఆయా ఆవాసాలకు చెందిన 40,598 మంది విద్యార్థులకు గరిష్టంగా ఏడాదికి రూ.6000 చొప్పున విద్యాశాఖ రవాణ భత్యం అందించనుంది.
Published date : 21 May 2021 03:15PM

Photo Stories