UPSC: ఐఈఎస్లో రామగుండం వాసికి 31వ ర్యాంక్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ శాంతినగర్కు చెందిన రావికంటి వంశీకృష్ణ ఐఈఎస్(ఇండియన్ ఇంజినీరింగ్ స ర్వీస్) ఆల్ ఇండియాస్థాయిలో 31వ ర్యాంక్ సాధించాడు.
వంశీకృష్ణ ఎఫ్సీఐలోని డీఏవీ, ఎన్టీపీసీలోని చిన్మయ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఏపీలోని గుడివాడ, విజయవాడలో ఇంటర్మీడియెట్, హైదరాబాద్లో బీటెక్ అభ్యసించాడు 2019 సంవత్సరంలో టీఎస్ ఎస్పీడీసీఎల్లో రాష్ట్రస్థాయిలో ఐ దో ర్యాంక్ సాధించాడు.
చదవండి: UPSC: ఐఈఎస్లో అభిషేక్కు 42వ ర్యాంకు
హైదరాబాద్ ఆబిడ్స్లో టీ ఎస్ ఎస్పీడీఎల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా లాంగ్ లీవ్ పెట్టి.. ఇంటి వద్ద ఐఈఎస్కు ప్రిపేర్ అయ్యాడు.
#Tags