Nalawala Mahender: జేఎంఈటీ ఫలితాల్లో నస్పూర్‌ వాసి ప్రతిభ

నస్పూర్‌: సింగరేణి సంస్థలో అధికారిగా ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో కష్టపడి చదివి రెండు ఉద్యోగాలు సాధించాడు నస్పూర్‌ వాసి నలవల మహేందర్‌.

ఆర్‌జీ 3 ఓసీపీ 2లో జనరల్‌ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తూ నస్పూర్‌లోని షిర్కే కాలనీలో నివాసం ఉండే నలువల తిరుపతి, తారా దంపతుల కుమారుడు మహేందర్‌ సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఎంజీటీ(మైనింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ట్రైనీ) ఫలితాల్లో 26వ ర్యాంకు సాధించాడు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అక్టోబర్ 9న విడుదల చేసిన జేఎంటీ(జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రైనీ) ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కి అర్హత సాధించి మెయిన్స్‌కి సిద్ధం అవుతున్నాడు. మహేందర్‌ ప్రస్తుతం పుణేలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సింగరేణిలో రెండు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడంపై కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags