Teachers in School: ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు..!

ప్రతీ తరగతికి ఒక్కో ఉపాధ్యాయులు ఉంటే పిల్లలకు చదువు చెప్పవచ్చు. కానీ, ఈ గ్రామంలో ఉపాధ్యాయుల కారణంగా పిల్లల పరిస్థితి..

ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే విధులు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి ప్రాథమిక పాఠశాలను సాక్షి విజిట్‌ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐదు తరగతులకు 64 మంది విద్యార్థులున్నారు.

TS Model Schools: ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు... చివ‌రి తేదీ ఇదే..

తరగతికి ఒక టీచర్‌ ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు సెలవు పెట్టగా, మరొకరు డీఈవో ఆఫీసులో పనిపై వెళ్లారు. దీంతో మిగిలిన టీచర్‌ స్వప్న మాత్రమే విధులు నిర్వహించారు. ఉపాధ్యాయుల తీరుపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

#Tags