PG Admissions: నిఫ్టెమ్‌లో పోస్ట్‌ గ్రాడ్యువేషన్‌ ప్రవేశాలు.. ఈ కోర్సుల్లోనే..

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..

సాక్షి ఎడ్యుకేషన్‌: కుండ్లి(హర్యానా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నిఫ్టెమ్‌).. 2024–25 అడ్మిషన్‌ సెషన్‌కు సంబంధించి ఎంటెక్, ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
 
కోర్సుల వివరాలు
»    మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌): 100 సీట్లు: విభాగాలు: ఫుడ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సేఫ్టీ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌.
»    మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ): 60 సీట్లు.
»    అర్హత: ఎంబీఏకు బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంటెక్‌కు బీ­ఈ/బీటెక్,బీఎస్సీ,ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://niftem.ac.in

#Tags