M Tech Admissions : జేఎన్‌టీయూ కాకినాడలో ఎంటెక్‌ ప్రవేశాలు.. ఈ అర్హ‌త‌లు ఉండాలి..

కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూకే).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పాన్సర్డ్‌ విభాగంలో ఎంటెక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కాకినాడ, నరసరావుపేట క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

»    అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీల అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. గేట్‌ 2024/జీప్యాట్‌ 2025/పీజీఈసెట్‌ 2024 ర్యాంకు, పని అనుభవం, కౌన్సెలింగ్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
»    దరఖాస్తు పంపాల్సిన చిరునామ: డైరెక్టర్, అడ్మిషన్స్, జేఎన్‌టీయూ కాకినాడ.
»    వెబ్‌సైట్‌: https://www.jntuk.edu.in

AP Education Syllabus : విద్యా సిలబస్‌లో మార్పులు చేయండి: సీఎం చంద్రబాబు

#Tags