APPSC Group-2 Prelims 2024 Official Key: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫైనల్‌ కీ ఈరోజే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ తుది కీ ఈరోజు(ఫిబ్రవరి 26)న వెలువడనుంది. వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో నిన్న(ఫిబ్రవరి 25)న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రిలిమ్స్‌కు 87.17 శాతం హాజరు
ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కాగా మొత్తం 87.17 శాతం మంది గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68–70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. కానీ ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి  గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం.

ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కులు..
గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌ కుమా­ర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.పోస్టుల సంఖ్యను బట్టి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రిలిమ్స్ జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.జూన్‌ లేదా జూలైలో గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహించనున్నారు.

#Tags