Boat Sinks: తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మందికి పైగా మృతి

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఒక మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ఘటన ఏప్రిల్ 7వ తేదీ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో పడవలో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పడవ బోల్తా పడిందని నాంపులా ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో చాలా మంది చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఐదు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మిగిలిన మృత దేహాలను వెలికి తీయడం కష్టతరంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు.. సైంటిస్టుల హెచ్చరిక!!

#Tags