Hindi Radio Broadcast: ఇక్కడ తొలిసారి హిందీ రేడియో ప్రసారాలు ప్రారంభం
ఈ ప్రసార కార్యక్రమం ప్రారంభమైనట్లు భారత రాయబార కార్యాలయం ఏప్రిల్ 22వ తేదీ ఎక్స్ వేదికగా వెల్లండించింది. ఈ చారిత్రక ఘట్టన.. భారత్, కువైట్ మధ్య దీర్ఘకాలిక స్నేహం, సహకారానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రతి ఆదివారం ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రిక్వెన్సీలలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాలు, కువైట్లో నివసించే 10 లక్షల మందికి పైగా భారతీయులకు ఒక ముఖ్యమైన సంబంధాన్ని అందిస్తాయి. వారి స్వదేశ భాషలో వార్తలు, సంగీతం, వినోదం, సమాచారాన్ని పొందడానికి ఇది వారికి ఒక వేదికను అందిస్తుంది.
ఈ కొత్త రేడియో ప్రసారాల ప్రారంభం, ఇరు దేశాల మధ్య సంస్కృతి, వ్యాపారం, వ్యక్తిగత సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో సహాయపడుతుందని భారత రాయబార కార్యాలయం నమ్ముతోంది. 1961 నుంచి భారతదేశం కువైట్కు ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ఈ కొత్త కార్యక్రమం ఈ దీర్ఘకాలిక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 2021-2022 సంవత్సరానికి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు అవుతోంది.
World's Largest Democracy: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే..