YVU Graduation Day: వైవీయూలో స్నాతకోత్సవానికి దరఖాస్తుల గడువు పెంపు..!

విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవానికి విద్యా‍ర్థులు పొందే పట్టాలకోసం దరఖాస్తులు చేసుకోవాలన్న విషయం తెలిసిందే. అయితే, అందుకు తేదీని పొడగించింది వర్సిటీ..

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ నెలలో నిర్వహించ తలపెట్టిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌ గురువారం వెల్లడించారు.

Farming: రైతుగా మారిన లెక్చరర్‌..

విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటిదాకా వివిధ డిగ్రీల పట్టాల కోసం 8,898 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. విద్యార్థులు సకాలంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Free Coaching for UPSC CSAT 2025: యూపీఎస్సీ సీశాట్‌–2025 ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

#Tags