Jobs: 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
కాళోజీ సెంటర్ : మహేశ్వరంలోని రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్లో వాచ్మెన్లు, స్కావెంజర్ పోస్టుల తాత్కాలిక భర్తీకి ఆగస్టు 19వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వరంగల్ డీఈఓ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు గల పురుషులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుదారుడు కనీసం 5.6 అడుగుల ఎత్తు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు అర్హతపత్రాల జిరాక్స్ కాపీలను ఆగస్టు 19లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని వివరించారు.
చదవండి:
#Tags