JNV Admissions: నవోదయ ప్రవేశాలకు ఆహ్వానం

శ్రీకాకుళం న్యూకాలనీ: జవహర్‌ నవోదయ విద్యాలయం(జేఎన్‌వీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడిందని.. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వెన్నెలవలస నవోదయ ప్రిన్సిపాల్‌ దాసరి పరశురామయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జనవరి 18న జరిగే ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 16 లోపు http://navodaya.gov.inఅనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2013 మే 1 నుంచి 2015 జులై 31 మధ్య జన్మించినవారు అర్హులని స్పష్టంచేశారు. పూర్తి వివరాలకు జేఎన్‌వీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

చదవండి: Arshad Nadeem: ల‌క్ష్యానికి పేద‌రికం అడ్డు రాద‌న్న అర్షద్ నదీమ్‌.. ఒక్కపూట తిండిలేకున్నా ఒలింపిక్‌ వీరుడిగా..

#Tags