Essay Competitions: విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

జయపురం: మితి స్థాయి పాణి పంచాయతీ పక్షం–2024 ఉత్సవాల సందర్భంగా జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జ‌నవ‌రి 7న‌ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు.

జయపురం బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి చందన నాయక్‌, హెచ్‌ఎం శ్యామ మెహరా పర్యవేక్షణలో నిర్వహించిన వక్తత్వ, వ్యాసరచన, క్విజ్‌, చిత్రలేఖనం, తర్క్‌ (వాదన) విజ్ఞాన ప్రదర్శన పోటీలకు 40 పాఠశాలల విద్యార్థులు హాజరయ్యాయి.

చదవండి: Ambedkar's Constitution: అంబేడ్కర్ రాజ్యాంగలో ప్రపంచ మానవతా సూత్రాలు

ఉపేంద్రదీప్‌ ,ప్రభాత్‌రథ్‌, సుశ్మిత రథ్‌, బిశ్వరంజన్‌ గౌడ, సునీల్‌ గౌడ, ప్రకాశ చంద్ర పట్నాయక్‌, నృశింగ ప్రసాద్‌ షొడంగి, ప్రభాకర్‌ మహరాణ, శివరామ్‌ పాణిగ్రహి, సబిత పట్నాయక్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఉపాధ్యాయులు యజ్ఞేశ్వర పండా, సీఆర్‌సీసీ రౌత్‌ పర్యవేక్షించారు.

#Tags