NCERT Notification 2024: ఎన్‌సీఈఆర్‌టీ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)..

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ).. దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ విద్యా సంస్థ(ఆర్‌ఐఈ)ల్లో వివిధ ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎన్‌సీఈఆర్‌టీ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

»    ఆర్‌ఐఈ ఉన్న ప్రాంతాలు: అజ్‌మేర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్‌.

కోర్సులు–ఆర్‌ఐఈ క్యాంపస్‌ వివరాలు
»    బీఎస్సీ బీఈడీ (నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు)–భువనేశ్వర్, మైసూరు.
»    బీఏ బీఈడీ(నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌)–భువనేశ్వర్, మైసూరు.
»    ఎంఎస్సీఈడీ(ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌)–మైసూరు.
»    బీఈడీ(రెండేళ్లు)–అజ్‌మేర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్‌.
»    బీఈడీ–ఎంఈడీ(మూడేళ్లు)–భోపాల్‌.
»    ఎంఈడీ(రెండేళ్లు)–అజ్‌మేర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్‌.
»    అర్హత: కోర్సును అనుసరించి 10+2/హయ్యర్‌ సెకండరీ/సీనియర్‌ సెకండరీ, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2024
»    ప్రవేశ పరీక్ష తేది: 16.06.2024.
»    బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఎంఎస్సీఈడీ పరీక్ష ఫలితాల వెల్లడి తేది: 05.07.2024.
»    బీఈడీ, ఎంఈడీ పరీక్ష ఫలితాల ప్రకటన తేది: 10.07.2024.
»    వెబ్‌సైట్‌: https://cee.ncert.gov.in

#Tags