Job mela: 21న జాబ్‌ మేళా

తిరుపతి ఎడ్యుకేషన్‌: తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉప ఉపాధి కార్యాలయంలో నవంబర్ 21వ తేదీ ఉదయం 10గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఆ మేరకు ఉప ఉపాధి అధికారి ఎస్‌.వెంకటరమణ నవంబర్ 16 గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో శ్రీరామ్‌ చిట్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో మార్కెటింగ్‌ అండ్‌ రికవరీ ఉద్యోగాలకు ఆ సంస్థ ప్రతినిధులు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ విద్యార్హత కలిగి, 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న సీ్త్ర, పురుషులు అర్హులని, ఆసక్తి ఉన్న వారు 77023 00292 నంబరులో సంప్రదించాలని కోరారు. అలాగే నిరుద్యోగ అభ్యర్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్‌.జీఓవి.ఇన్‌’ వెబ్‌సైట్లో పూర్తి వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

చ‌ద‌వండి: Job mela: రేపు వికాస ఆధ్వర్యంలో జాబ్‌మేళా

#Tags