SLAS Exam: రేపు ఉపాధ్యాయులకు శ్లాస్‌ పరీక్ష..

ఉపాధ్యాయులకు నిర్వహించనున్న శ్లాస్‌ పరీక్షలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని తెలిపారు డీఈఓ బ్రహ్మాజీరావు.

పాడేరురూరల్‌: స్టేట్‌ లెవెల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(శ్లాస్‌) పరీక్షకు సంబంధించి ఎంపిక చేసిన 147 పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదివారం విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది. పాడేరులోని కుమ్మరిపుట్టు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీరావు ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈనెల 16న జరిగే ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి కె.కృష్ణమూర్తి,ఐటీ సెల్‌ కో ఆర్డినేటర్‌ కామరాజు తదితరులు పాల్గొన్నారు.

KGBV Inter Student: కేజీబీవీ ఇంటర్‌ విద్యార్థినికి ఎంఈఓ అభినందనలు..

#Tags