Spot Admissions: పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈనెల 18న స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు (ఐవీసీ) పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందేందుకు ఈ నెల 18న తిరు పతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, జిల్లా నోడల్ ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు.
అలాగే ఈ నెల 16వ తేదీలోపు సమీపంలోని ఏదేని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు 18వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలని సూచించారు.
#Tags