ITI Second Phase Counselling : ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఐటీఐల్లో ప్ర‌వేశాల‌కు రెండో విడ‌త కౌన్సెలింగ్‌..

రాజమహేంద్రవరం రూరల్‌: పదో తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన అభ్యర్థులకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌ఆర్‌ఆర్‌ కృష్ణన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా శనివారం నుంచి జూలై 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం నుంచి జూలై 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. వివరాలకు 92940 50231, 78010 95303 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Bank of Baroda Notification 2024 : స్పెషలిస్ట్‌ విభాగాల్లో ప్రొఫెషనల్స్‌ నియామకాలు.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ!

#Tags