Mega Job Mela: రేపు వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా.. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు

తిరుపతి రూరల్‌ : చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మేళాలో 33 మల్టీ నేషనల్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సూచన మేరకు జాబ్‌మేళాకు విచ్చేసే అభ్యర్థులకు పకడ్బందీగా సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. పదోతరగతి నుంచి ఇంటర్‌, బీటెక్‌, ఎంబీఏ విద్యార్హత కలిగినవారు మేళాకు హాజరుకావచ్చన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌ మేళాకు అర్హులందరూ ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించారు.

చ‌ద‌వండి: Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 25 కంపెనీల మెగా జాబ్ మేళా.. ఎక్క‌డంటే..

#Tags