Skip to main content

Diploma Exams: తెలంగాణ‌లో ఆ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన సాంకేతిక విద్యామండలి

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీన నిర్వ‌హించ‌నున్న గ్రూప్ 4 ప‌రీక్ష నేప‌థ్యంలో కొన్ని ప‌రీక్ష‌లు వాయిదా వేశారు. జూన్ 30వ తేదీన పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో జ‌ర‌గాల్సిన స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు బోర్డు కార్య‌ద‌ర్శి ఎ.పుల్ల‌య్య గురువారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
Diploma Exams
Diploma Exams

ప‌రీక్ష సంద‌ర్భంగా జూన్ 30 న నిర్వ‌హించాల్సిన ప‌రీక్ష‌ను జులై 15వ తేదీకి వాయిదా వేశారు. మిగిలిన ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని సాంకేతిక విద్యాశాఖ వెల్ల‌డించింది. విద్యార్థులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచించింది. 

Published date : 29 Jun 2023 06:51PM

Photo Stories