Skip to main content

Education News: బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ సూచించారు.
school building start in Dumbriguda   Abhishek, Paderu ITDA PO, advocates for inclusive education.  Abhishek, Paderu ITDA PO, advocates for inclusive education
విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేస్తున్నపీవో అభిషేక్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలోని సాగరలో రూ.5.9 లక్షలతో మరమ్మతులు చేపట్టిన పాఠశాల భవనాన్ని ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించారు. వారితో కాసేపు ముచ్చటించారు. బిస్కెట్లు, చాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గ్రామాల్లో బడి ఈడు పిల్లలు బయట ఉండకూడదన్నారు. విద్యతోనే భవిష్యత్తు సాధ్యమని, ప్రతి రోజు పిల్లలను స్కూల్‌కు పంపించేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. 

చదవండి: ప్రైవేట్‌ స్కూల్స్‌లో పేద పిల్లలకు 25% ఉచిత సీట్లు, నోటిఫికేషన్‌ విడుదల

Published date : 22 Feb 2024 05:38PM

Photo Stories