ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలోని సాగరలో రూ.5.9 లక్షలతో మరమ్మతులు చేపట్టిన పాఠశాల భవనాన్ని ఫిబ్రవరి 21వ తేదీ ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించారు. వారితో కాసేపు ముచ్చటించారు. బిస్కెట్లు, చాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గ్రామాల్లో బడి ఈడు పిల్లలు బయట ఉండకూడదన్నారు. విద్యతోనే భవిష్యత్తు సాధ్యమని, ప్రతి రోజు పిల్లలను స్కూల్కు పంపించేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు.