Skip to main content

Junior College Meals Scheme : జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఈ ప‌థ‌కం పున‌రుద్దరించేందుకు నిర‌స‌న‌..

PRSYF members protest to reconcile mid day meals scheme in junior colleges

రాయచోటి అర్బన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని పీఆర్‌ఎస్‌వైఎఫ్‌ నాయకుడు నాగేంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం జూనియర్‌ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందన్నారు.

Change of Formative Assessment Test Name : మారిన ఫార్మేటివ్ అసెస్మెంట్‌ టెస్ట్ పేరు.. ఇక‌పై ప‌రీక్ష రోజులు కూడా..

కొంతకాలం తర్వాత పథకాన్ని పాలకులు రద్దు చేశారన్నారు. పథకం రద్దుతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాయచోటి నాయకులు మాలిక్‌బాషా, మనోజ్‌, విష్ణు, రాజ, మహేష్‌లతో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Published date : 18 Aug 2024 09:00AM

Photo Stories