Skip to main content

Navodaya Entrance Exam: సాఫీగా సాగిన నవోదయ ప్రవేశ పరీక్షలు..

ఇటీవలె నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అక్కడి ప్రిన్సిపాల్‌ తెలిపారు. హాజరైన విద్యార్థుల సంఖ్యతోపాటు జరిగిన పరీక్ష గురించి కూడా వెల్లడించారు..
Entrance exam by students for admission at Navodaya School    Principal's statement: Navodaya entrance exams conducted peacefully  Successful Navodaya entrance exams: Principal confirms peaceful conduct.    Navodaya entrance exams: Students attend peacefully.

సాక్షి ఎడ్యుకేషన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా సాగింది. స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయ, ఏపీ గురుకుల పాఠశాలలో జరిగిన పరీక్షకు 1,199 మంది విద్యార్థులు హాజరైనట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ నాగరాజు తెలిపారు.

Asha Workers Salary Hike : కనీస వేతనం రూ.18 వేలు ఇవాల్సిందే.. అలాగే ప్రమోషన్ కూడా..

9వ తరగతిలో ప్రవేశానికి 1,003 మంది దరఖాస్తు చేసుకోగా, 789 మంది పరీక్షకు హాజరుకాగా, 214 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే 11వ తరగతిలో ప్రవేశానికి 619 మంది దరఖాస్తు చేసుకోగా, 410 మంది పరీక్షకు హాజరయ్యారని, 209 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.

Published date : 12 Feb 2024 10:56AM

Photo Stories