Skip to main content

Intermediate Exams 2024: ముగిసిన ఇంటర్‌ పరీక్షలు,మొత్తం ఎంతమంది రాశారంటే..

Academic year   Intermediate Exams 2024  Exam Schedule Notice  Examination completion

ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఒకేషనల్‌ కోర్సులు చదివే వారికి శనివారంతో పరీక్షలు పూర్తి కానున్నాయి. వీరు వెయ్యిమంది లోపు ఉంటారని ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదటి, రెండో సంవత్సరం కలిపి 82,766 మంది విద్యార్థులు రాశారు. పరీక్షలు విజయవంతంగా పూర్తికావటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఏడాది పాటు ఎంతో శ్రద్ధతో సిద్ధమై పరీక్షలకు రాసిన విద్యార్థులు సైతం వీటిని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒత్తిడి నుంచి బయటపడ్డారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు సందడిగా కనిపించారు. రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ఉంటూ చదువుకున్న విద్యార్థులు పరీక్షలు పూర్తికావటంతో ఇంటిదారి పట్టారు.

 

Published date : 16 Mar 2024 12:43PM

Photo Stories