Skip to main content

Exam: జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు..

పరీక్షల్లో ఎవరికైనా ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు.
He gave the answer sheet and wrote the test in kerala
జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు..

కానీ కేరళ యూనివర్సిటీ పరీక్షలో మాత్రం విద్యారి్థకి ఏకంగా జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు. ఇంకేముంది.. ఆ విద్యార్థి దొరికిందే చాన్స్ అనుకొని ఎంచక్కా పరీక్ష రాసేసి వెళ్లిపోయాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన వర్సిటీ పరీక్ష రద్దు చేసింది.  బీఎస్సీ ఎల్రక్టానిక్స్‌ నాలుగో సెమిస్టర్‌ చదువుతున్న ఓ విద్యార్థి కరోనా వల్ల ‘సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌’పరీక్షకు హాజరుకాలేకపోయాడు. దీంతో అతని కోసం ఈ ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌ ఆఫీస్‌ పొరపాటున ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ముద్రించి పంపింది. ఇని్వజిలేటర్‌ కూడా దాన్నే విద్యారి్థకి ఇచ్చాడు. ఈ విషయాన్ని విద్యార్థి బయటకు చెప్పకుండా ఆ జవాబులను నింపేసి వెళ్లిపోయాడు. ఆ పేపర్‌ దిద్దిన ప్రొఫెసర్‌ జరిగిన పొరపాటును గుర్తించి విద్యారి్థకి ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ఇచ్చారని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసిన యూనివర్సిటీ మే మూడో తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జరిగిన పొరపాటుపై వర్సిటీ విచారణకు ఆదేశించింది.

Sakshi Education Mobile App
Published date : 02 May 2022 03:59PM

Photo Stories