Skip to main content

Gurukul School Admissions : గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో సీట్ల భ‌ర్తీ.. ఈ ప‌ద్ధ‌తిలోనే..

Gurukul school admissions for fifth class in lottery manner

బోట్‌క్లబ్‌: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా ఖాళీ సీట్లను భర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త జి.వెంకటరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏ పాఠశాలను అయితే కోరుకుంటారో ఆ పాఠశాలకు వెళ్లి దరకాస్తు చేసుకోవాలన్నారు. ఇంతకుముందు పాఠశాలలో దరఖాస్తు ఇచ్చినవారు, దరఖాస్తు చేయనివారు హాజరుకావచ్చునన్నారు. ఇ కేటగిరి విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.

Degree Admissions: ఈ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీకి నో డిమాండ్‌!

Published date : 03 Jul 2024 04:05PM

Photo Stories