Skip to main content

Group 1 rankers: విద్యార్థుల‌కు స‌న్మానస‌భ‌

గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌లో విజ‌యం పొందిన టాప‌ర్ల‌కు స‌న్మాన‌స‌భ ఏర్ప‌రిచారు. వారంద‌రికీ అభినంద‌న‌లు తెలిపి, స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ముఖ్యఅతిథి కూడా విద్యార్థుల‌ను అభినందించారు.
Group-1 rankers with Chief guest and Officers
Group-1 rankers with Chief guest and Officers

సాక్షి ఎడ్యుకేష‌న్: నగరంలోని ఓ హోటల్‌లో గ్రూప్‌–1 టాపర్ల అభినందన సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఫర్‌ ది సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఏఎస్‌ విశ్రాంత అధికారి చిన్న వీరభద్రుడు హాజరై, మాట్లాడారు. ఈ విజేతలు రేపటి దేశ భవితను తీర్చిదిద్దగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ అధ్యక్షుడు పోతుల రాధాకృష్ణ మాట్లాడుతూ... దృఢ సంకల్పంతో వైకల్యాన్ని జయించి గ్రూప్‌ 1 విజేతగా నిలిచిన కవిరాజును ప్రత్యేకంగా అభినందించారు.

Student Success: క‌ళాశాల నుంచి యూనివ‌ర్సిటీలోకి సీటు సాధించిన విద్యార్థిని

ఎస్కేయూ తెలుగు విభాగం ప్రొఫెసర్‌ సదాశివరెడ్డి, నార్పల తహసీల్దార్‌ హరికుమార్‌, కొత్తపల్లి సురేష్‌ మాట్లాడుతూ... పోతుల రాధాకృష్ణ ఆలోచన స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. విజేతలను సన్మానించుకోవడమంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. అనంతరం గ్రూప్‌ వన్‌ విజేతలు శ్రీరామచంద్ర, కవిరాజు, జ్ఞానానందరెడ్డి ల‌ను ఘనంగా సన్మానించారు. ఎస్కేయూ రిజిస్టర్‌ లక్ష్మయ్య, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 19 Sep 2023 01:51PM

Photo Stories