Skip to main content

Osmania University : ఓయూ కేంద్రంగా ఎన్నో అంకుర సంస్థలు ఆవిర్భవించాలి..: డాక్టర్ సతీశ్ రెడ్డి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అద్భుత ప్రతిభ కలిగిన ఎంతో మంది మేధావులను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచానికి అందించిందని రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీశ్ రెడ్డి అన్నారు.

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న‌ గ్లోబల్ అలుమ్నీ మీట్ సందర్భంగా ఈయ‌న మాట్లాడుతూ.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ప్రస్తుతం పరివర్తన చెందుతోందన్నారు. ఓయూ కేంద్రంగా ఎన్నో అంకుర సంస్థలు ఆవిర్భవించాలని ఆకాంక్షించారు.

ఉన్నత విద్యా సంస్థల్లో చ‌దివిన వారు సైతం..

drdo satheesh reddy news in telugu

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ సహా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పు తీసుకొచ్చాయని వివరించారు. ఈ ఫలితంగానే  దేశీయ పరిజ్ఞానంతో ఆయుధాలు, యుద్ద విమానాల తయారీ చేపట్టగలిగామని స్పష్టం చేశారు. ఐఐటీలు సహా ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన 75% మంది మేధావులు గతంలో విదేశాలకు వలసవెళ్లేవారని.. ప్రస్తుతం 75%  మంది తిరిగి భారత్ వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే 2017లో 461 అంకుర సంస్థలు ఆవిర్భవించగా.. 2022 నాటికి 75వేల అంకుర సంస్థలు ఏర్పడ్డాయని వెల్లడించారు. ఉస్మానియాతో తనకున్న 35 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సతీష్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు ఉస్మానియా పూరోభివృద్ధికి వెన్నెముకగా నిలవాలని పిలుపునిచ్చారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు మాట్లాడుతూ..

professor bj rao

కంటెంట్ కన్నా ఆలోచనలు ముఖ్యమైనవని.. ఈ విషయంలో ఉస్మానియా వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు చెప్పారు. అధ్యాపకులు భవిష్యత్తు సవాళ్లపై దృష్టి సారించాలన్న ప్రొఫెసర్ బీజే రావు.. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. పరిమిత వనరుల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పనిచేయాలని.. ఇందులో భారత్ ప్రపంచ యవనికపై పోటీ పడుతోందని చెప్పారు. పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ పురోగమిస్తోందని వివరించారు.

భవిష్యత్తు అంతా భారత్‌దే..
హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా ఇతర సంస్థలతో పోల్చుకోకుండా ఉస్మానియా ఉస్మానియా విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందాలని... ప్రపంచవిశ్వవిద్యాలయాలకు ఓయూ ఏ మాత్రం తీసిపోదని టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని మెటాస్టాసిస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రఘు కల్లూరి అన్నారు. భవిష్యత్తు అంతా భారత్‌దే అన్నారు. ఈయ‌న ఆత్మ విశ్వాసంతో  అనుకున్నది సాధించాలని పిలుపునిచ్చారు.  ప్రపంచానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ నాయకత్వం వహిస్తుందని వివరించారు. ఏ దశకు చేరుకున్నా తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థను మరిచిపోవద్దని అన్నారు. 

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ..
దేశానికి చదువుల మార్గం చూపిన సావిత్రీభాయి పూలే 192వ జయంతి కూడా ఇవాళే రావటం ఆనందంగా ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. సావిత్రీ భాయి ఫూలే ప్రేరణతో చదువుల్లో అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఉత్తమ పరిశోధనా అవార్డులను..
డాక్టర్ సతీశ్ రెడ్డి, బీజేరావుల చేతుల మీదుగా ఉత్తమ పరిశోధనా అవార్డులను అందజేశారు. కేటగిరీ Iలో భాగంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్. ఎ. రామకృష్ణ, ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజినీరింగ్ నుంచి ప్రొఫెసర్ శశికాంత్, కెమిస్ట్రీ నుండి డాక్టర్ పి.మురళీధర్ రెడ్డి. ప్రత్యేక విభాగంలో డాక్టర్ T. జ్యోతి , మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్ కుమార్, అనుబంధ కళాశాలల విభాగంలో సీబీఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి సుధాకర్ బాబు అవార్డులు అందుకున్నారు.

OU Latest News in TeluguLatest OU NewsOU Latest PicsOU Program
Published date : 03 Jan 2023 08:12PM

Photo Stories