Skip to main content

Dr Gayathri: స్విమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ఫెలోషిప్‌ అవార్డు

తిరుపతి తుడా: స్విమ్స్‌ యూనివ­ర్సి­టీలో అసోసి­యేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గా­యత్రిని అమెరికన్‌ అసో­సి­యేషన్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎండోక్రినాల­జీ (ఎఫ్‌ఏసీఈ) ప్రతి­ష్టాత్మకమైన ఫెలోషి­ప్‌ అకాడమిక్‌ ఎక్స్‌­లెన్స్‌ అవార్డు వరించింది.
Fellowship Award to Associate Professor of SVIMS   Dr. Gayatri receiving the Fellowship Academic Excellence Award from the American Association of Clinical Endocrinology

ఈ మేరకు ఆమెకు ఫెలోషిప్‌ అవార్డు వచ్చినట్లు స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ మే 23న‌ మీడియాకు తెలిపారు.

చదవండి: Admission in SVIMS Tirupati: తిరుపతి స్విమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

మే 11వ తేదీన అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఓర్లిన్స్‌లో నిర్వహించిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ క్లినిక్‌ ఎండోక్రైనాలజిస్ట్స్‌ వార్షికోత్సవ సదస్సులో గాయత్రి ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఆమె ప్రతి­భను గుర్తించిన సంబంధిత అసోసియేషన్‌ ఈ ఫెలోషిప్‌ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా డాక్టర్‌ గాయత్రిని స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.వి. కుమార్‌ అభినందించారు. 

Published date : 23 May 2024 05:43PM

Photo Stories