కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పరిధిలో ఈ విద్యాసంవత్సరానికి ఆన్లైన్లో ప్రవేశాలకు ఈనెల 20 వరకు గడువు పొడిగిచింది. స్టడీసెంటర్ సమన్వయకర్త యంఆర్.గౌతమ్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
IGNOU
విశ్వవిద్యాలయం అందిస్తున్న సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, అన్ని పీజీ కోర్సులకు ప్రవేశాలు జరుగుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఈ ఏడాది నుంచి కొత్త కోర్సులను అందిస్తోందన్నారు. ప్రవేశాలతో పాటు ఫీజులు అన్లైన్లో ఉంటాయన్నారు. ఎంపిక చేసిన కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు విశ్వవిద్యాలయం పూర్తి ఫీజురాయితీ కల్పిస్తుందన్నారు.