Skip to main content

ముగ్గురు విద్యార్థులకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

కేయూ క్యాంపస్‌: కేయూలోని ఇంజనీరింగ్‌ విద్యార్థులు ముగ్గురు తెలంగాణ రాష్ట్ర హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.మల్లారెడ్డి గురువారం తెలిపారు.
Excellence Awards for three students
Excellence Awards for three students

కో–ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు లుక్క స్నేహిత, మాలోతు నవత, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి తేజశ్రీ ఇందులో ఉన్నారు. ఈనెల 20న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన విద్యా దినోత్సవ వేడుకల్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చేతుల మీదుగా వారు అవార్డులు అందుకున్నారు. వీరు సర్టిఫికెట్లు, ఒక్కొక్కరు రూ.10 వేల చెక్కులు కూడా అందుకున్నట్లు తెలిపారు. విద్యార్థులను వీసీ తాటికొండ రమేశ్‌, రిజిస్ట్రార్‌ టి.శ్రీనివాస్‌రావు అభినందించారు.

Published date : 23 Jun 2023 04:03PM

Photo Stories