Skip to main content

Due to Heavy Rain Schools and Colleges closed : నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు బంద్‌.. ఎక్క‌డంటే..?

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే స్కూల్స్‌, కాలేజీల‌కు వెళ్లే విద్యార్థులు చాలా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.
Rainy day struggles for students, Weather disruption in schools and colleges, School and college issues in rainy weather, Community affected by continuous heavy rain,

రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. వరదల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. 

☛ Three Days Schools Holiday : వ‌రుస‌గా న‌వంబ‌ర్ 11, 12, 13 తేదీల్లో స్కూల్స్‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

రాష్ట్రంలోని 12 జిల్లాల్లో..

schools and colleges holiday due to rain telugu news

తమిళనాడువ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబ‌త్తూరు, తిరువూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండ‌పోత వాన కురిసింది. ఇక, నీలగిరి జిల్లాలోని ఐదు తాలుకాల‌ను వ‌ర్షం ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్‌, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

☛ Diwali Schools and Colleges Holiday Change: దీపావళి సెలవు మార్పు.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు.. ఆ రెండు రోజులు కూడా హాలిడేస్‌

నేటి నుంచి పాఠశాలలను మూసివేస్తున్నట్లు..
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా తిరువారూర్‌ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్‌లోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. 

నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు..
నీలగిరి మౌంటైన్‌ రైల్వేలోని కల్లార్‌, కూనూర్‌ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్‌ 16 వరకు ఆ రూట్స్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

☛ November Schools and Colleges Holidays List 2023 : నవంబర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌చ్చే సెల‌వులు ఇవే.. దాదాపు 10 రోజులు పాటు..

Published date : 10 Nov 2023 12:32PM

Photo Stories