Skip to main content

AP IIIT Admissions : ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..

AP IIIT Admissions  Triple ITs in Andhra Pradesh   Apply Now for Integrated B Tech Courses

ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్‌ ఐటీలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 2024-25 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో (B.Tech Courses)ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈనెల 8 నుంచి ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

సర్కార్‌ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4శాతం డిప్రవేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.rgukt.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 
 

Published date : 06 May 2024 03:45PM

Photo Stories